అర్మేనియా, ఉజ్బెకిస్తాన్ మీదుగా యూఏఈ వెళ్తున్న భారతీయులు

- May 16, 2021 , by Maagulf
అర్మేనియా, ఉజ్బెకిస్తాన్ మీదుగా యూఏఈ వెళ్తున్న భారతీయులు

కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతితో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాలకు వెళ్లాల్సిన వారు సొంత దేశంలోనే చిక్కుకుపోయారు. అయితే..నిషేధం ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుకుంటున్నారు. నేరుగా భారత్ నుంచి వచ్చే వారిపై నిషేధం ఉన్నా..ఇతర దేశాలకు వెళ్లి క్వారంటైన్లో ఉండి వస్తే మాత్రం వారిని అనుమతిస్తుండటంతో...చాలామంది ప్రవాస భారతీయులు ఆర్మేనియా, ఉజ్బెకిస్తాన్ వెళ్లి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి..ఆ తర్వాత యూఏఈకి వెళ్లి ఉద్యోగాల్లో చేరుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com