ఏపీ కరోనా అప్డేట్

- May 19, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి తగ్గట్లేదు. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,01,330 శాంపిల్స్‌ పరీక్షించగా.. 23,160 కేసులు నమోదయ్యాయి. మరో 106 మంది కరోనాతో కన్నుమూశారు. మరోవైపు కొత్తగా 24,819 మంది కరోనా నుంచి కోలుకున్నారు.దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 12,79,110కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,82,41,637 శాంపిల్స్‌ పరీక్షించారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com