లోన్ చెల్లింపులపై రిలీఫ్..ఈఎంఐ చెల్లింపులు వాయిదా
- May 28, 2021బహ్రెయిన్: కోవిడ్ తో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బ్యాంక్ లోన్లు రుణగ్రహీతలకు అదనపు భారం కాకుండా బహ్రెయిన్ ప్రభుత్వం మరోసారి మారటోరియం ప్రకటించింది బహ్రెయిన్. ఆరు నెలల పాటు రుణాల ఈఎంఐ వసూళ్లను వాయిదా వేస్తూ నిర్ణయించింది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ దేశంలోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు మారటోరియం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 6 నెలల పాటు లోన్ వాయిదాల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చు. ఈ మారటోరియం కాలానికి సంబంధించి ఎలాంటి ఆలస్యం రుసుములు, అదనపు ఛార్జీలు, వడ్డీలు ఉండవు. అలాగే వాయిదాల సంఖ్యను పెంచొద్దని, అయితే..వాయిదా వ్యవధిని బట్టి రుణాలపై వర్తించే వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం