శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

- June 06, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు పట్టుకున్నారు.దోహా నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు డీఆర్ఐ అధికారులు.ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తంలో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారంతో శంషాబాద్ లో మాటు వేశారు డీఆర్ఐ అధికారులు.దోహా నుండి వచ్చిన ఆఫ్రికా దేశస్థురాలి పై అనుమానం వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డగించిన అధికారుల బృందం…తమదైన విచారణ చేయగా బయటపడింది డ్రగ్స్‌ సరఫరా గుట్టు. ప్రయాణీకురాలు మాకుంభ కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com