"ప్రేమికుడు" చిత్రం ఆడియో మార్చ్ 13న
- March 07, 2016
22 ఏళ్ళ క్రితం ప్రభు దేవా హీరోగా పరిచయమైన బ్లాక్ బస్టర్ మూవీ 'ప్రేమికుడు' అదే టైటిల్ తో డిజి పోస్ట్ సమర్పణ లో ఎస్ ఎస్ సినిమా బ్యానర్ పై 'కళా' సందీప్ బి ఏ దర్శకత్వంలో మానస్, సనమ్ శెట్టి హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చలన చిత్రం 'ప్రేమికుడు' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వుంది. వాలటైన్ డే సందర్భం గా విడుదలైన ఈ టీజర్ కి యూత్ లో విశేష స్పందన వచ్చింది. కాగ ఈ చిత్రం ఆడియో మార్చ్ 13న సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు 'కళా' సుదీప్ బి ఏ మాట్లాడుతూ ."ప్రేమికుల రోజు న మా ప్రేమికుడు టీజర్ రిలీజ్ చేసాము ముఖ్యంగా యూత్ నుండి విశేష స్పందన లబించింది.
ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ అనేది మర్చిపోలేని అనుభూతి. అలాంటి ఒక అందమైన ప్రేమకధే ప్రేమికుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకి వినూత్న కథా కథనం, విసువల్ బ్యూటీ, చక్కని సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్ఫుల్ లవ్ స్టోరీ అవుతుందని చెప్పారు. లవ్ బ్యాక్ డ్రాప్ లో హృదయానికి హద్దుకునే ఫీల్ గుడ్ మూవీ లా, కామెడి సీన్స్ తో ఎంటర్ టైన్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా వుంటుంది. ఈ కథలోని పాత్రలలో ప్రస్తుత యువత తమకు తామే ఓన్ చేసుకుని చూసుకుంటారు తమ స్వత్చమైన లవ్ ఫీలింగ్స్ కి అద్దంలా వుంటుంది."అన్నారు
నిర్మాత కె లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లోని పలు కొత్త లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నాము .అంతకు ముందు హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంది. మార్చి 13న సినీ ప్రముఖుల చేతుల మీదుగా, హై టెక్ సిటీ లోని రాక్ హైట్స్ లో ఆడియో కార్యక్రమం ఘనంగా చేస్తున్నాము. దర్శకుడు 'కళా'సందీప్ బి ఏ ప్రేమికుడిని, ఈ ప్రేమ కథని ఎంచుకుని చాలా అందంగా ఈ నాటి యువతకి కనెక్ట్ అయ్యేలాగా తీర్చి దిద్దారు . సహా నిర్మాత వరికుంట్ల సురేష్ బాబు మాట్లాడుతూ' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆడియో ఫంక్షన్ తరువాత స్టూడెంట్స్ కి పరీక్షలు అయిన వెంటనే సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు.ఈ చిత్రానికి విజయ్ బాలాజీ సంగీతాన్ని సమకూర్చగా, ఛాయాగ్రహణం-శివ కె, ఎడిటింగ్-' కేరింత' మధు, డాన్సు డైరెక్టర్- అర్ కె, ఆర్ట్ -భాస్కర్, సహా నిర్మాత : వరికుంట్ల సురేష్ బాబు (రాజ) నిర్మాతలు : లక్ష్మి నారాయణ రెడ్డి .కె, ఇసనాక సునీల్ రెడ్డి, కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : 'కళా' సందీప్ బి .ఏ
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









