రెడ్ లిస్టు దేశాల వారికి వర్క్ పర్మిట్లు నిలిపివేత
- June 14, 2021బహ్రెయిన్: భారత్ నుంచి కొత్తగా వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిచ్చింది బహ్రెయిన్.రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే వర్క్ పర్మిట్ల దరఖాస్తును అనుమతించబోమని, ఆయా దేశాల వారికి కొత్త వర్క్ పర్మిట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణికులను రాకను నిషేధించిన విషయం తెలిసిందే. గత నెల 24 నుంచి ఈ మేరకు ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలను కూడా రెడ్ లిస్టులో చేర్చింది. ఇక ఇప్పుడు రెడ్ లిస్టు దేశాలవారికి కొత్త వర్క్ పర్మిట్లను ఇవ్వబోమని ప్రకటించింది. అయితే..ఈ ఆదేశాలు ఇప్పటికే బహ్రెయిన్లో ఉన్నవారికి మాత్రం వర్తించవు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?