భవనంపై నుంచి పడి.. భారత యువకుడి దుర్మరణం!
- June 18, 2021
యూఏఈ: షార్జాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడి చనిపోయాడు. అదే భవనంలో ఉండే కొందరితో గొడవ పడ్డ యువకుడు వారి నుంచి తప్పించుకునే క్రమంలో భవనం పై నుంచి పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు షార్జా పోలీసులు తెలిపారు. మృతుడిని టీవీ విష్ణు(29)గా గుర్తించారు. షార్జాలోని అబు షాగ్రాలో ఈ ఘటన జరిగింది. విష్ణు నివాస ముండే భవనంలోనే కొందరు ఆఫ్రికన్లు ఉన్నారు. విష్ణుతో వారు ఘర్షణ పడ్డారు.ఈ క్రమంలో ఆఫ్రికన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన విష్ణు కాలు జారి కింద పడ్డాడు.తీవ్రంగా గాయపడ్డ విష్ణు అక్కడికక్కడే చనిపోయాడు.మెదడులో ఇంటర్నల్ బ్లీడిండ్ కావడంతోనే విష్ణు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన షార్జా పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, అబు షాగ్రాలో విష్ణు ఓ సెలూన్లో పని చేస్తున్నట్లు తెలిసింది.ఈ కేసులో పోలీసులు కొన్ని అరెస్టులు చేసి నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
ధృవీకరించని సమాచారాన్ని ప్రసారం చేయవద్దని పోలీసులు నివాసితులకు సూచించారు, ఎందుకంటే ఇది నివాసితులలో భయాందోళనలకు గురి చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







