ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బుకింగ్స్ నిలిపివేత
- June 19, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రైవేట్ ఆస్పత్రులు సినోఫార్మ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ ను నిలిపివేస్తున్నాయి. జూన్ మాసానికి సంబంధించి ఇప్పటికే స్లాట్ బుకింగ్స్ పూర్తి
కావటంతో కొత్త బుకింగ్ తీసుకోవటం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అబుధాబిలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రులు వీపీఎస్, ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ లలో ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ స్లాట్స్ కు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నాయి. జూన్ నెలకు సంబంధించి ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ పూర్తి కావటంతో జులై నెలకు సంబంధించి స్లాట్ బుకింగ్స్ ను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక వీపీఎస్ ఆస్పత్రిలో మాత్రం సినోఫార్మ్ ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ ను పూర్తిగా నిలిపివేసింది. ఇదిలాఉంటే అభుదాబి హెల్త్ సర్వీస్ కంపెనీ-సెహా మాత్రం తమ వైద్య కేంద్రాల్లో అన్ని డోసుల బుకింగ్స్ ను అహ్వానిస్తోంది. ఫైజర్, సినోఫార్మ్ వ్యాక్సిన్ కోసం సెహా మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







