ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బుకింగ్స్ నిలిపివేత
- June 19, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రైవేట్ ఆస్పత్రులు సినోఫార్మ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ ను నిలిపివేస్తున్నాయి. జూన్ మాసానికి సంబంధించి ఇప్పటికే స్లాట్ బుకింగ్స్ పూర్తి
కావటంతో కొత్త బుకింగ్ తీసుకోవటం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అబుధాబిలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రులు వీపీఎస్, ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ లలో ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ స్లాట్స్ కు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నాయి. జూన్ నెలకు సంబంధించి ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ పూర్తి కావటంతో జులై నెలకు సంబంధించి స్లాట్ బుకింగ్స్ ను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక వీపీఎస్ ఆస్పత్రిలో మాత్రం సినోఫార్మ్ ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ ను పూర్తిగా నిలిపివేసింది. ఇదిలాఉంటే అభుదాబి హెల్త్ సర్వీస్ కంపెనీ-సెహా మాత్రం తమ వైద్య కేంద్రాల్లో అన్ని డోసుల బుకింగ్స్ ను అహ్వానిస్తోంది. ఫైజర్, సినోఫార్మ్ వ్యాక్సిన్ కోసం సెహా మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







