ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బుకింగ్స్ నిలిపివేత
- June 19, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రైవేట్ ఆస్పత్రులు సినోఫార్మ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ ను నిలిపివేస్తున్నాయి. జూన్ మాసానికి సంబంధించి ఇప్పటికే స్లాట్ బుకింగ్స్ పూర్తి
కావటంతో కొత్త బుకింగ్ తీసుకోవటం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అబుధాబిలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రులు వీపీఎస్, ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ లలో ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ స్లాట్స్ కు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నాయి. జూన్ నెలకు సంబంధించి ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ పూర్తి కావటంతో జులై నెలకు సంబంధించి స్లాట్ బుకింగ్స్ ను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక వీపీఎస్ ఆస్పత్రిలో మాత్రం సినోఫార్మ్ ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ ను పూర్తిగా నిలిపివేసింది. ఇదిలాఉంటే అభుదాబి హెల్త్ సర్వీస్ కంపెనీ-సెహా మాత్రం తమ వైద్య కేంద్రాల్లో అన్ని డోసుల బుకింగ్స్ ను అహ్వానిస్తోంది. ఫైజర్, సినోఫార్మ్ వ్యాక్సిన్ కోసం సెహా మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









