భారత్ వ్యాక్సిన్ పై క్లారిటీ ఇచ్చిన యూఏఈ

- June 21, 2021 , by Maagulf
భారత్ వ్యాక్సిన్ పై క్లారిటీ ఇచ్చిన యూఏఈ

యూఏఈ: ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రా జెనకా కోవిడ్ 19 వ్యాక్సిన్, భారతదేశంలో కోవిషీల్డ్ పేరుతో విక్రయించబడుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈ ఆమోదం పొందినదేనని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. కోవిషీల్డ్ తీసుకున్నవారు భారతదేశం నుంచి యూఏఈకి వస్తే, వ్యాక్సినేషన్ పొందినట్లు గుర్తిస్తారా.? లేదా.? అన్నదానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సందేహాలకు యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ అని.. యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ ప్రయాణీకుల్ని, తగిన ప్రోటోకాల్స్ అనుగుణంగా అనుమతిస్తామని యూఏఈ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com