ఒమన్లో పెరుగుతున్న వైవాహిక వేధింపులు
- March 08, 2016
వైవహిక వేధింపులు ఒమన్లో పెరుగుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. పెరుగుతున్న అవగాహన కారణంగా వేధింపుల కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయనీ, ఇలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఖావ్లా అల్ వహాబి మాట్లాడుతూ, వైవాహిక వేధింపులను తొలి దిశలోనే మహిళలు గుర్తించి, ఫిర్యాదు చేయాలని సూచించారు. తన వద్దకు ప్రతి నెలా ఐదు కేసులు ఇలాంటివి వస్తుంటాయని, వైవాహిక వేధింపులతో మహిళల్లో అనేక రకాలైన మానసిక, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. చాలామంది మహిళలు సమస్యల్ని పరిష్కరించుకోగలమని అనుకుంటారనీ, కొన్ని సందర్భాల్లో విధిలేక వాటిని భరిస్తుంటారని అల్ వహాబి వివరించారు. 140 మంది మహిళలను ఈ అంశంపై ప్రశ్నించగా, అందులో 60 శాతం మంది అనగా 90 మంది వైవాహిక వేధింపులకు సంబంధించి తాము బాధితులమని ఒప్పుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా ఒమన్ సొసైటీ తరఫున సుల్తాన్ బూస్ యూనివర్సిటీ ఇటీవల ఓ వర్క్షాప్ కూడా నిర్వహించింది. ఇందులో చట్టబద్ధమైన పరిష్కారాలు, సామాజిక కోణాలు వంటి వాటి గురించి చర్చించారు. వైవాహిక వేధింపుల్లో ఎక్కువగా ఇంటిమేట్ పార్టనర్ వయొలెన్స్ ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







