శ్రీవారి ఆన్లైన్ టికెట్లను ఇప్పట్లో పెంచేది లేదు..
- July 03, 2021
తిరుమల: కరోనా వైరస్ తీవ్రత ఇంకా కొసాగుతూనే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆన్లైన్ టికెట్లను పెంచే ఉద్దేశం లేదని టీటీడీ పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈవో కేఎస్ జవహర్రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా కనిపించడం లేదు.
మరోవైపు,శ్రీవారి జిలేబీ, మురుకుల ప్రసాదం ధరలను టీటీడీ పెంచింది. శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ సమయంలో జిలేబీతోపాటు మురుకులను నివేదిస్తుంటారు. తిరుప్పావడ టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ. 100గా ఉన్న ధరను రూ. 500కు పెంచింది. కాగా, చిన్న, పెద్ద లడ్డూలు, వడల ధరలను టీటీడీ ఇప్పటికే పెంచింది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు