ఎక్స్‌పో 2020: కీలక భూమిక పోషించిన షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్‌కి థ్యాంక్స్ చెప్పిన దుబాయ్ రూలర్

- July 07, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020: కీలక భూమిక పోషించిన షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్‌కి థ్యాంక్స్ చెప్పిన దుబాయ్ రూలర్

యూఏఈ: మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ రూలర్ నుంచి అభినందనలు అందుకున్నారు ఎక్స్‌పో 2020 దుబాయ్ నిర్వహణ విషయమై. ఇంతటి మెగా ఈవెంట్ నిర్వహణ సాధారణ విషయం కాదనీ, ఏర్పాట్ల విషయంలో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అత్యంత సమర్థవంతంగా పనిచేశారని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతుతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభ తీసుకొచ్చారని కొనియాడారు. అక్టోబర్ నెలలో ఈ ఎక్స్‌పో ప్రారంభం కానుంది. యూఏఈ ఫారిన్ మినిస్టర్‌కి డెడికేట్ చేసిన ఫొటో గేలరీని పోస్ట్ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com