భారత్ కరోనా అప్డేట్

- July 16, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

భారత్ లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.నిన్న‌టి బులిటెన్ ప్ర‌కారం రోజువారీ కేసులు 40వేల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా,ఈరోజు రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం కేసులు 40 వేల‌కు దిగువున న‌మోద‌య్యాయి.భారత్ లో కొత్త‌గా 38,949 కేసులు న‌మోద‌వ్వ‌గా, 542 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,10,26,829కి చేరింది.ఇందులో 3,01,83,876 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,30,422 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనా నుంచి 40,026 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యాయి.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,12,531 మంది క‌రోనాతో మృతి చెందారు.దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 39,78,078 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 39,53,43,767మందికి వ్యాక్సిన్ లు అందించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com