రోజుకు రూ.150లు ఆదా చేస్తే.. రూ. 20 లక్షలు..!
- July 16, 2021
భారత్: ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ సంస్థలో పెట్టుబడి పెడితే భద్రతకు భరోసా ఉంటుంది.మీ డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్కు సంబంధించిన పధకం PPF కూడా ఒకటి. ఇందులో రోజుకు రూ.150లు.. అంటే నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.54వేలు అవుతుంది. మీరు సేవింగ్ పీరియడ్ 20 ఏళ్లు ఎంచుకుంటే అప్పుడు మీరు దాచుకున్న మొత్తం రూ.10.8 లక్షలు అవుతుంది. మళ్లీ దీనిపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే మీకు 20 ఏళ్లకు ఏకంగా రూ.20 లక్షలకు పైగా లభిస్తాయి. మీరు రూ.100లతో కూడా పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. పీపీఎఫ్ ఖాతాపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సాధారణంగా పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. ఈ పీరియడ్ని 5 ఏళ్లు చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. పీపీఎఫ్ అకౌంట్లో ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన దుబాయ్ కొత్త భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!







