ఎక్స్పో 2020 దుబాయ్: కరోనా తర్వాత ఆర్ధిక రంగానికి కొత్త ఊతం
- July 30, 2021
దుబాయ్: ప్రపంచంలోనే అతి పెద్ద షో. దుబాయ్ ఎక్స్పో 2020 కరోనా తర్వాత ఆర్ధిక రంగానికి కొత్త ఊతాన్ని ఇవ్వనుందని భారత కాన్సూల్ జనరల్ డాక్టర్ అమన్ పురి చెప్పారు. ఆర్ధిక రంగం తిరిగి పుంజుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, వ్యాపార సంస్థలు దీన్నొక అద్భుతమైన వేదికగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఛాలెంజింగ్ పరిస్థితుల్లో యుఏఈ సాహసోపేతంగా ఈ ఈవెంట్ నిర్వహించడాన్ని అభినందించారాయన. ఈ ఎక్స్పో ద్వారా వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించాలని భారతదేశం భావిస్తోందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా మరియు స్టార్టప్ ఇండియా నినాదాలతో ఈ ఎక్స్పో ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నట్లు చెప్పారు. లక్షలాది, కోట్లాది ఆలోచనలకు ఇండియా మంచి వేదిక. కాబట్టి, ప్రపంచం ఈ ఆలోచనల నుంచి లాభపడాలనీ, అలాగే ప్రపంచ దేశాల నుండి భారత దేశం అత్యద్భుత సాయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇండియా, కొరియా మధ్య బిజినెస్ మీట్ సందర్భంగా అమన్ పురి చెప్పారు. పలు ఎంబసీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామనీ ఆయా దేశాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నామనీ అన్నారు. ఇండియా, కొరియా భాగస్వామ్యం ప్రాంతంలో అత్యంత ప్రత్యేకమైనదనీ చెప్పారాయన. కొరియన్ కాన్సూల్ జనరల్ మూన్ బై యుంగ్ జున్ మాట్లాడుతూ ఇండియా, కొరియా ప్రపంచంలోనే అతి పెద్ద ఎకనమిక్ పవర్స్ అని అన్నారు.



తాజా వార్తలు
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్









