ప్రవాసులకు ఇండియన్ అంబాసిడర్ సూచనలు
- August 02, 2021మనామా: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బహ్రెయిన్లోని ఇండియన్ కమ్యూనిటీకి ఆ దేశంలోని ఇండియన్ అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ కీలక సూచనలు చేశారు.బహ్రెయిన్లో అమలవుతున్న కరోనా నిబంధనలను పాటిస్తూ, మహమ్మారికి వ్యతిరేకంగా బహ్రెయిన్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని సూచించారు.వర్చువల్ విధానంలో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మాట్లాడుతూ..ఇండియన్ కమ్యూనిటీ సభ్యులందరినీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరారు.వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు ఎదురైతే.. ఎంబసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన లింక్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ను బుక్ చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా సాధరణ, అత్యవసర కాన్సులర్ సేవలపై ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. లేబర్ సమస్యలను సైతం ప్రస్తావించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు