యూఏఈ: 2021లో పెరిగిన విపిఎన్ డౌన్లోడ్స్, దుర్వినియోగం చేస్తే 2 మిలియన్ దిర్హాముల జరీమానా
- August 18, 2021
యూఏఈ: వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. విపిఎన్ అప్లికేషన్ డౌన్లోడ్స్ 2021లో చాలా పెరిగిందనీ, 2020తో పోల్చితే ఈ పెరుగుదల చాలా ఎక్కువని అధికారులు చెబుతున్నారు. అమెరికాకి చెందిన అట్లాస్ విపిఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2021 తొలి అర్థ భాగంలో ప్రపంచ వ్యాప్తంగా విపిఎన్ అందిపుచ్చుకున్న దేశాల్లో యూఏఈ ముందు వరుసలో వుందని తెలుస్తోంది. 3.9 మిలియన్ విపిఎన్ అప్లికేషన్లు డౌన్లోడ్ అయ్యాయి 2021 తొలి అర్థ భాగంలో. ఖతార్ ఈ విభాగంలో 44.47 శాతంతో ముందంజలో వుంది. రెండో స్థానంలో యూఏఈ (39.91 శాతం) నిలిచింది. ఇండియాలో 25.27 శాతం మంది విపిఎన్ వినియోగిస్తున్నారు. 2020లో యూఏఈ మొదటి స్థానంలో నిలిచింది. 61.61 శాతం యూఏఈ జనాభా విపిఎన్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. కాగా, సింగిల్ యూసేజ్ విపిఎన్ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. కాగా, నిబంధనల్ని అనుసరించి విపిఎన్ వినియోగిస్తే ఎలాంటి సమస్యా వుండదు. నిబంధనల్ని అతిక్రమిస్తే మాత్రం 500,00 దిర్హాములకు తక్కువ కాకుండా 2 మిలియన్ దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది. తాత్కలిక జైలు శిక్ష కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







