షేక్ మొహమ్మద్ కార్యాలయ ఉద్యోగుల్లో 85 శాతం మహిళలు

- August 28, 2021 , by Maagulf
షేక్ మొహమ్మద్ కార్యాలయ ఉద్యోగుల్లో 85 శాతం మహిళలు

యూఏఈ: ఎమిరేటీ విమెన్స్ డే సందర్భంగా యూఏఈ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రని కొనియాడారు దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా షేక్ మొహమ్మద్ ఓ వీడియో విడుదల చేశారు. మదర్ ఆఫ్ ఎమిరేట్స్ షేక్ ఫాతిమా బింట్ ముబారక్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. అభినందనలు తెలిపారు. ఎమిరేట్‌ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ప్రతి మహిళకీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 70 శాతం పైగా యూఏఈ గ్రాడ్యుయేట్లు మహిళలేనని ఆయన వివరించారు. తన కార్యాలయంలో 85 శాతం ఉద్యోగులు మహిళలని అన్నారు. ఒక్క మహిళ వెయ్యి మంది పురుషులకు సమానమని ఆయన అభివర్ణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com