షేక్ మొహమ్మద్ కార్యాలయ ఉద్యోగుల్లో 85 శాతం మహిళలు
- August 28, 2021
యూఏఈ: ఎమిరేటీ విమెన్స్ డే సందర్భంగా యూఏఈ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రని కొనియాడారు దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా షేక్ మొహమ్మద్ ఓ వీడియో విడుదల చేశారు. మదర్ ఆఫ్ ఎమిరేట్స్ షేక్ ఫాతిమా బింట్ ముబారక్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. అభినందనలు తెలిపారు. ఎమిరేట్ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ప్రతి మహిళకీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 70 శాతం పైగా యూఏఈ గ్రాడ్యుయేట్లు మహిళలేనని ఆయన వివరించారు. తన కార్యాలయంలో 85 శాతం ఉద్యోగులు మహిళలని అన్నారు. ఒక్క మహిళ వెయ్యి మంది పురుషులకు సమానమని ఆయన అభివర్ణించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







