సింగిల్ డోస్ తీసుకున్న స్టూడెంట్స్, స్టాఫ్ కి స్కూళ్లోకి అనుమతి

- September 05, 2021 , by Maagulf
సింగిల్ డోస్ తీసుకున్న  స్టూడెంట్స్, స్టాఫ్ కి స్కూళ్లోకి అనుమతి

కువైట్: ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైన కువైట్ విద్యా శాఖ...స్కూల్ కి వచ్చే స్టూడెంట్స్, స్టాఫ్ కి సంబంధించి మరో విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. స్కూల్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్, స్టాఫ్ తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తొలి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకోవటానికి సమయం అవసరం కనుక..సింగిల్ డోస్ తీసుకున్న వారికి కూడా ఎంట్రీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com