వాహనాల్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయోద్దు..దుబాయ్ పోలీసుల వార్నింగ్
- September 05, 2021
దుబాయ్: పార్క్ చేసిన వాహనాల్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయోద్దంటూ దుబాయ్ పోలీసులు తల్లిదండ్రులు హెచ్చరించారు. ముఖ్యంగా వేడివాతావరణంలో పార్క్ చేసిన వాహనాల్లో ఉష్ణోగ్రత 70 సెల్సియస్ డిగ్రీలకు చేరే అవకాశాలు ఉంటాయని, దీంతో పిల్లల ప్రాణాలకు ముప్పు ఉంటుందని పేర్కొంది. సమ్మర్ సీజన్ కు ముందు పిల్లల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలంటూ దుబాయ్ పోలీసులు చేపట్టిన క్యాంపేన్లో భాగంగా ఈ జాగ్రత్త చర్యలను సూచించారు. వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలేయోద్దనే నినాదంతో పోలీసులు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంగా కార్లలోనే వదిలేసి వెళ్తుంటారని, ఈ అలక్ష్యం ఒక్కోసారి పరిణామాలకు దారితీస్తాయని పోలీసులు చెబుతున్నారు. గత ఏడు నెలల్లో తాము వాహనాల్లో వదిలేసిన 39 పిల్లల్ని రక్షించామని గుర్తు చేశారు. పిల్లల్ని తమ వెంట తీసుకువెళ్లకుండా కార్లోనే కూర్చొబెట్టి లాక్ వేసి వెళ్తుంటారని...కానీ, వాహనాల్లోని తీవ్రమైన వేడి, ప్రాణవాయువు కొరతతో పిల్లలు ఊపిరాడక స్పృహ కోల్పోవడం, ప్రాణాలు కొల్పోవటం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెను విషాదాన్ని నింపుతాయన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







