ఎక్స్పో 2020: నేటి నుంచి మాక్ డ్రిల్ చేపట్టనున్న దుబాయ్ పోలీస్
- September 07, 2021
యూఏఈ: దుబాయ్ పోలీస్, ఎక్స్పో 2020 పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నేటి నుంచి (సెప్టెంబర్ 7 మంగళవారం) ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్ అక్టోబర్ 1 న ప్రారంభం కాబోతోంది. కాగా, ఇప్పటికే పలువురు ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్స్పో 2020 సన్నద్ధతకు సంబంధించి వివరాలను నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. 191 దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొననున్నాయి. అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మరియు కమిటీ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ తహ్నౌమ్ మాట్లాడుతూ ఈ ఎక్స్పో అంగరంగ వైభవంగా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వినియోగించి, ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమంలో మెరుగైన సేవలు అందించనుంది దుబాయ్ పోలీస్.
తాజా వార్తలు
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!









