వాట్సాప్లో సరికొత్త ఫీచర్
- September 09, 2021
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్ను వినియోగిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మెసేజింగ్ యాప్పై ఆధారపడుతున్నారు. కొందరికి వాట్సాప్ లేనిదే రోజు గడవదు. ఈ స్థాయిలో ప్రజల జీవితాల్లో భాగమైంది వాట్సాప్.వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్ను తిరిగి యూజర్లకు అందుబాటులోకి రానుంది. చివరిసారిగా వాట్సాప్ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్సీన్ సెట్టింగ్లో అప్డేట్ను తీసుకురానుంది.
ఈ ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గుడ్ న్యూస్తో పాటు మరో బ్యాడ్ న్యూస్ కూడా షేర్ చేసింది వాట్సాప్. త్వరలోనే ఓల్డ్ ఫోన్ యూజర్లకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. కొన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపి వేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఆండ్రాయిడ్ 4.0.3, అంతకంటే తక్కువ వెర్షన్ పై నడుస్తున్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నవంబరు 1 నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అలాగే ios 9 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ వెర్షన్ పై పనిచేస్తున్న అన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని ప్రకటించింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







