సెక్యూరిటీ చేతికి పెప్పర్ స్ప్రే...కువైట్ ఆమోదం
- September 14, 2021
కువైట్ సిటీ: దేశంలోని పలు విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది పెప్పర్ స్ప్రేని ఉపయోగించడానికి కువైట్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. అంతర్గత మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు గస్తీ పోలీసులు, ప్రజా భద్రత, అత్యవసర, ట్రాఫిక్, నేర పరిశోధనలతో అన్ని విభాగాల భత్రత సిబ్బందికి పెప్పర్ స్ప్రే గన్స్ ను ఇవ్వనున్నారు. అయితే వాంటెడ్ లిస్ట్ లో ఉన్న నేరస్తులు పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించిన సందర్భాల్లో పెప్పర్ స్ప్రే గన్స్ ప్రయోగించొచ్చు.
నేరస్తులను అదుపు చేసేందుకు..నిరసనలు అదుపు తప్పినప్పుడు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రపంచంలోని పలు దేశాలలో ఇప్పటికే పెప్పర్ స్ప్రే వినియోగం అమలులో ఉంది. పెప్పర్ స్ప్రే కొనుగోలుకు సంబంధించి ఆర్డర్ పూర్తయిందని, మరికొన్ని వారాల్లోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు అనుసరించాల్సిన విధానాలపై గత జూలైలో అంతర్గత మంత్రిత్వ శాఖ 8 సమావేశాలను నిర్వహించిందని, దాడులు నివారణకు హాట్ పెప్పర్ స్ప్రేని ప్రవేశపెట్టడం, ఎలక్ట్రిక్ లాఠీని వినియోగించడం వంటి అంశాలను అప్పట్లో చర్చించామని, అందుకు అనుగుణంగానే పెప్పర్ స్ప్రే వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







