భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- September 16, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.సెంకండ్ వేవ్ ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.గ‌త కొన్ని రోజులుగా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా దేశంలో 30,570 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో కొత్త‌గా న‌మోదైన కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనా నుంచి 38,303 మంది కోలుకున్నట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 431 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,43,928కి చేరింది. క‌రోనా నుంచి బ‌య‌టప‌డేందుకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. 24 గంట‌ల్లో భారత్‌లో 64,51,423 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 76,57,17,137 మందికి టీకాలు వేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com