ఈ నెల 12న విడుదల కానున్న 'జ్యోతిలక్ష్మీ'
- June 05, 2015
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..''మా జ్యోతిలక్ష్మీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ పూర్తయిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నిన్న రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఛార్మికి, పూరిజగన్నాథ్ గారికి 'జ్యోతిలక్ష్మీ' ఓ మెమరబుల్ మూవీ అవుతుంది'' అన్నారు. కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఛార్మి, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, ఎటిడింగ్ : ఎస్.ఆర్.శేఖర్, కెమెరా పి.జి.విందా, నిర్మాతలు : శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం పూరిజగన్నాథ్.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









