వ్యాట్ రెండింతలకు పెంచనున్న బహ్రెయిన్
- September 27, 2021
బహ్రెయిన్: ఆర్థిక వ్యవస్థను తిరిగా గాడిలో పెట్టేందుకోసం వ్యాట్ని రెండింతలు చేయాలని (10 శాతం) బహ్రెయిన్ యోచిస్తోంది. తద్వారా 2024 నాటికి తిరిగి బడ్జెట్ లాభదాయకమైన పరిస్థితికి వచ్చేలా చేయాలన్నది బహ్రెయిన్ ప్రణాళిక. కరోనా పాండమిక్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందున, అత్యంత వేగంగా పుంజుకునే దిశగా కీలక చర్యలు చేపట్టనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందనీ, ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం పడకుండా వ్యాట్ పెంపుతోపాటు, మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని బహ్రెయిన్ భావిస్తోంది. లిక్విడిటీ సపోర్ట్ ఫండ్ రెండింతలు.. అంటే 200 బహరెయినీ దినార్లకు చేరుకునేలా చర్యలు చేపడతారు. సెంట్రల్ బ్యాంక్ ఎనేబుల్డ్ లోన్ డిఫరల్స్ వంటి విభాగాల్లో సంస్కరణలు చేపడతారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









