భారత ప్రభుత్వానికి తాలిబన్లు లేఖ
- September 29, 2021
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మొదలయ్యి నెల రోజులైంది.ఇప్పటి వరకు పాక్ మినహా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు నడపడం లేదు.దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది.అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం గుర్తించలేదు.ఇక ఉదిలా ఉంటే, తాలిబన్లు మొదటిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖను రాశారు.అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన తరువాత ఖతర్ టెక్నాలజీని సపోర్ట్గా తీసుకొని ఎయిర్పోర్ట్ను రెడీ చేశామని, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రయాణాలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, తమ దేశానికి చెందిన రెండు అధికారిక విమాన సంస్థలైన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్, కామ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానాలను తిరిగి ప్రారంభించబోతున్నారని, వాణిజ్య విమానా రవాణాకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ తాలిబన్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









