భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- October 01, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  రెండు రోజుల క్రితం వ‌ర‌కు త‌గ్గుతూ వ‌స్తున్న కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా భారత్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 26,727 కొత్త కేసులు న‌మోద‌యిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707కి చేరింది.ఇందులో 3,30,43,144 మంది కోలుకోగా, 2,75,224 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 277 మంది మృతి చెందారు.దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,339కి చేరింది.దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతోంది.గ‌డిచిన 24 గంట‌ల్లో 64,40,451 మందికి వ్యాక్సిన్ అందించారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు భారత్‌లో 89,02,08,007 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com