అపర కుబేరుల సరసన చేరిన ముకేశ్ అంబానీ

- October 09, 2021 , by Maagulf
అపర కుబేరుల సరసన చేరిన ముకేశ్ అంబానీ

ముంబై: ప్రపంచ మేటి సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ చేరారు. జెఫ్ బేజోస్‌, ఎలన్ మస్క్ లాంటి హేమాహేమీల సరసన ఆయన నిలిచారు. కనీసం వంద బిలియన్ల డాలర్లు కలిగి ఉన్న సంపన్నుల లిస్టులో ముఖేశ్ చేరడం గమనార్హం. బిలియనీర్ల ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌లో మొత్తం 11 మంది ఉన్నారు. ముఖేశ్ ఆ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు ముఖేశ్ ఆస్తుల విలువ సుమారు 100.6 బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొన్నది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం ఈ ఏడాది 23.8 బిలియన్ల డాలర్లను ముఖేశ్ ఆర్జించారు. సంపన్నుల జాబితాలో మస్క్‌, బేజోస్ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్‌, బిల్ గేట్స్‌, ల్యారీ పేజ్‌, మార్క్ జుకర్‌బర్గ్‌, సెర్గే బ్రిన్‌, లారీ ఎలిసన్‌, స్టీవ్ బాల్మర్‌, వారెన్ బఫెట్‌, ముఖేశ్ అంబానీలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com