అపర కుబేరుల సరసన చేరిన ముకేశ్ అంబానీ
- October 09, 2021
ముంబై: ప్రపంచ మేటి సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ చేరారు. జెఫ్ బేజోస్, ఎలన్ మస్క్ లాంటి హేమాహేమీల సరసన ఆయన నిలిచారు. కనీసం వంద బిలియన్ల డాలర్లు కలిగి ఉన్న సంపన్నుల లిస్టులో ముఖేశ్ చేరడం గమనార్హం. బిలియనీర్ల ఎక్స్క్లూజివ్ క్లబ్లో మొత్తం 11 మంది ఉన్నారు. ముఖేశ్ ఆ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు ముఖేశ్ ఆస్తుల విలువ సుమారు 100.6 బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొన్నది. బ్లూమ్బర్గ్ ప్రకారం ఈ ఏడాది 23.8 బిలియన్ల డాలర్లను ముఖేశ్ ఆర్జించారు. సంపన్నుల జాబితాలో మస్క్, బేజోస్ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్, ల్యారీ పేజ్, మార్క్ జుకర్బర్గ్, సెర్గే బ్రిన్, లారీ ఎలిసన్, స్టీవ్ బాల్మర్, వారెన్ బఫెట్, ముఖేశ్ అంబానీలు ఉన్నారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









