న్యాయస్థానాల్లోకి వచ్చేందుకు లాయర్లకు అనుమతి....
- October 22, 2021సౌదీ అరేబియా: సౌదీలో అన్ని కోర్టులలో కోవిడ్ రూల్స్ ను సులభతరం చేశారు. కోర్టులలో లాయర్లను అనుమతించనున్నారు. ఇన్నాళ్లు కరోనా ఎఫెక్ట్ కారణంగా వర్చువల్ గానే కేసులను విచారిస్తున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో లాయర్లను కోర్టులలోకి అనుమతించాలని సౌదీ న్యాయశాఖ నిర్ణయించింది. దేశంలోని అన్ని కోర్టులలోకి లాయర్లకు పర్మిషన్ ఇచ్చింది. క్లయింట్స్ ను మాత్రం రిసెప్షన్ వరకే అనుమతించనున్నారు. అక్కడ నుంచే వారు క్లయింట్స్ తో మాట్లాడాల్సి ఉంటుంది. న్యాయశాఖకు సంబంధించిన అధికారుల విజ్ఞప్తి మేరకు హెల్త్ డిపార్ట్ మెంట్ రూల్స్ ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ న్యాయశాఖ తెలిపింది. అదే విధంగా ఈ లిటిగేషన్ ప్రొసీజర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఈ ప్రొసీజర్ ను కూడా అనుమతిస్తామంది. ఐతే కోర్టులో కి ఎంట్రీ ఇచ్చే వారందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. నెల రోజుల తర్వాత పరిస్థితిని బట్టి మరిన్ని సడలిపంపులు ఇస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..