టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాక్

- October 24, 2021 , by Maagulf
టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పాక్

దుబాయ్‌: టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. క్రికెట్‌ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంతో దాయాది జట్లు తమ టి20 వరల్డ్‌కప్‌ వేటను మొదలు పెట్టబోతున్నాయి. ఎన్ని మారినా ఇరు జట్ల మధ్య సమరాల్లో తుది ఫలితం మాత్రం మారలేదు. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడగా ప్రతీసారి భారత్‌నే విజయం వరించింది. వన్డే వరల్డ్‌కప్‌ను కూడా కలుపుకుంటే 12–0తో టీమిండియా తిరుగులేని ప్రదర్శన కనబర్చింది.

 

టీమిండియా : రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా

పాకిస్తాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com