టీమిండియాపై పాక్ ఘన విజయం
- October 24, 2021
దుబాయ్:టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయాన్ని అందుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్ అజమ్(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు)లు కలిసి తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 152 పరుగులు కొట్టి పాకిస్తాన్కు ఘన విజయాన్ని అందించారు. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లి, పంత్ కలసి టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టారు. కెప్టెన్ కోహ్లి(49 బంతుల్లో 57 పరుగులు, 5 ఫోర్లు, ఒక సిక్స్), పంత్( 30 బంతుల్లో 39 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాబాద్ ఖాన్, హరిస్ రౌత్ 1 చెరో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







