తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- December 29, 2025
తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ,మంత్రి అచ్చెన్నాయుడు, TV5 ఎండీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
సీఎంను శాలువాతో సత్కరించిన టీటీడీ చైర్మన్, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాల పై క్షణకాలం చర్చించారు.
రేవంత్ రెడ్డి రేపు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు.ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.భక్తుల భద్రత, దర్శన సౌలభ్యం కోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







