భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- October 25, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం...గత 24 గంటల్లో కొత్తగా 14,306 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 443 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కు చేరుకుంది.

ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,67,695 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,02,27,12,895 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 60,07,69,717 లక్షల మంది కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.18 శాతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com