శ్రీనగర్-షార్జా విమానానికి నో చెప్పేసిన పాక్
- November 03, 2021న్యూఢిల్లీ: శ్రీనగర్ – షార్జా వెళ్లే గో ఫస్ట్ ఎయిర్లైన్స్ విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది. తమ గగనతలాన్ని వినియోగంపై ఇస్లామాబాద్ ఆందోళన వ్యక్తం చేసింది.
దీంతో సంబంధిత మంత్రిత్వ శాఖలకు నివేదిక అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, హోంమంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ నివేదికలు పరిశీలిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులను గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్షా జెండా ఊపి ప్రారంభించారు.
గో ఫస్ట్ ఎయిర్లైన్స్ శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా విమానాలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. పాక్ నిర్ణయంతో విమానం ఉదయపూర్, అహ్మదాబాద్, ఒమన్ మీదుగా విమానం షార్జా ప్రయాణించాల్సి రాననున్నది. గగనతలం వినియోగానికి పాక్ అభ్యంతరం తెలుపడంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ చర్య దురదృష్టకరమన్నారు. పాక్ గగనతలంపై నుంచి ప్రయాణించడానికి గో ఫస్ట్కు అనుమతి లభిస్తుందని ఆశించినట్లు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?