దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్

- November 05, 2021 , by Maagulf
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్

దుబాయ్: యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ హిందూవులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.యూఏఈ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వారందరికీ షేక్ మొహమ్మద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి జరుపుకునే వారందరికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దుబాయ్ రూలర్ తన సందేశంలో ఆకాంక్షించారు. “యూఏఈ, ప్రపంచవ్యాప్తంగా దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా దేశం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.వారికి శాంతి,  శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కొనసాగాలని మేము కోరుకుంటున్నాము.’’ అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com