దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- November 05, 2021
దుబాయ్: యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ హిందూవులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.యూఏఈ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వారందరికీ షేక్ మొహమ్మద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి జరుపుకునే వారందరికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దుబాయ్ రూలర్ తన సందేశంలో ఆకాంక్షించారు. “యూఏఈ, ప్రపంచవ్యాప్తంగా దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా దేశం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.వారికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కొనసాగాలని మేము కోరుకుంటున్నాము.’’ అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్