ఎకో డ్రైవ్: రెండు ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించిన దుబాయ్
- November 13, 2021
దుబాయ్: కటింగ్ ఎడ్జ్ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ట్రయల్ ప్రారంభమయ్యింది. రెండు వోల్వో 7900 వాహనాల్ని ఎంపిక చేసిన మార్గాల్లో లా మెర్ సౌత్, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మరియు అల్ సుఫౌ ట్రామ్ స్టేషన్ల మధ్య వీటిని నడుపుతారు. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ, వోల్వో బస్ కంపెనీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ, మెరాస్ రియల్ ఎస్టేట్ మరియు ఎబిబి గ్రూప్ సంయుక్తంగా ఈ ఎకో ఫ్రెండ్లీ మార్గాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎబిబి గ్రూపు సరఫరా చేసే స్టాండింగ్ ఎలక్ట్రిక్ చార్జర్ వీటికి వినియోగిస్తున్నారు. నైట్ ఎలక్ట్రిక్ ఛార్జర్ అల్ కోజ్ బస్ డిపో వద్ద ఏర్పాటు చేశారు. స్టాండింగ్ ఆర్మ్ ద్వారా లా మెర్ వద్ద పార్కింగ్ స్లాట్లో ఛార్జింగ్ చేసేలా అలాగే వైర్ ద్వారా కూడా ఛార్జింగ్ చేసేలా అవకాశం దొరుకుతుంది. 2050 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యంగా యూఏఈ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









