విమానంలోనే దర్జాగా స్మోకింగ్...ఆంధ్ర వ్యక్తి అరెస్ట్
- November 15, 2021చెన్నై: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. బస్సులు, రైళ్లలో పొగతాాగరాదు అని చూసే ఉంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలోనే స్మోకింగ్ చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన కువైట్ నుంచి చెన్నై వచ్చిన విమానంలో జరిగింది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్కు చెందిన మహమ్మద్ షెరీఫ్(57).. కువైట్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్లో చెన్నైకి బుధవారం బయలుదేరాడు. అందులో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. తన దుస్తుల్లో దాచి సిగరెట్లను అక్రమంగా విమానంలోకి తీసుకొచ్చాడు. ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన క్రమంలో వాటిని తీసి పొగతాగటం ప్రారంభించాడు. స్మోకింగ్ చేయొద్దని తోటి ప్రయాణికులు చెప్పినా వినలేదు. దాంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.ఎయిర్ హోస్టెస్ వచ్చి సిగరెట్ తాగొద్దని చెప్పినా వారి మాట వినకుండా పొగ తాగటం కొనసాగించాడు. క్యాబిన్ సిబ్బంది, ఎయిర్ హోస్టెస్తో వాగ్వాదానికి కూడా దిగాడు.చెన్నైలో విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది షెరీఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..