విమానంలోనే దర్జాగా స్మోకింగ్...ఆంధ్ర వ్యక్తి అరెస్ట్
- November 15, 2021
చెన్నై: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. బస్సులు, రైళ్లలో పొగతాాగరాదు అని చూసే ఉంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలోనే స్మోకింగ్ చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన కువైట్ నుంచి చెన్నై వచ్చిన విమానంలో జరిగింది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్కు చెందిన మహమ్మద్ షెరీఫ్(57).. కువైట్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్లో చెన్నైకి బుధవారం బయలుదేరాడు. అందులో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. తన దుస్తుల్లో దాచి సిగరెట్లను అక్రమంగా విమానంలోకి తీసుకొచ్చాడు. ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన క్రమంలో వాటిని తీసి పొగతాగటం ప్రారంభించాడు. స్మోకింగ్ చేయొద్దని తోటి ప్రయాణికులు చెప్పినా వినలేదు. దాంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.ఎయిర్ హోస్టెస్ వచ్చి సిగరెట్ తాగొద్దని చెప్పినా వారి మాట వినకుండా పొగ తాగటం కొనసాగించాడు. క్యాబిన్ సిబ్బంది, ఎయిర్ హోస్టెస్తో వాగ్వాదానికి కూడా దిగాడు.చెన్నైలో విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది షెరీఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







