విమానంలోనే దర్జాగా స్మోకింగ్...ఆంధ్ర వ్యక్తి అరెస్ట్
- November 15, 2021
చెన్నై: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. బస్సులు, రైళ్లలో పొగతాాగరాదు అని చూసే ఉంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలోనే స్మోకింగ్ చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన కువైట్ నుంచి చెన్నై వచ్చిన విమానంలో జరిగింది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్కు చెందిన మహమ్మద్ షెరీఫ్(57).. కువైట్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్లో చెన్నైకి బుధవారం బయలుదేరాడు. అందులో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. తన దుస్తుల్లో దాచి సిగరెట్లను అక్రమంగా విమానంలోకి తీసుకొచ్చాడు. ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన క్రమంలో వాటిని తీసి పొగతాగటం ప్రారంభించాడు. స్మోకింగ్ చేయొద్దని తోటి ప్రయాణికులు చెప్పినా వినలేదు. దాంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.ఎయిర్ హోస్టెస్ వచ్చి సిగరెట్ తాగొద్దని చెప్పినా వారి మాట వినకుండా పొగ తాగటం కొనసాగించాడు. క్యాబిన్ సిబ్బంది, ఎయిర్ హోస్టెస్తో వాగ్వాదానికి కూడా దిగాడు.చెన్నైలో విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది షెరీఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







