ఇది ఆరంభం మాత్రమే..ఇంకా ఉధృతం చేస్తాం: కేసీఆర్ @ మహా ధర్నా
- November 18, 2021హైదరాబాద్: కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినామని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. పంజాబ్లో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరినట్లు చెప్పారు. ప్రధానికి లేఖ రాసిన ఉలుకు లేదు పలుకు లేదని విమర్శించారు. ఇది ఈ రోజుతో ఆగేది లేదని... దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉధృతమై ఉప్పెనోలే మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ