విమానాశ్రయాల్లో యూఏఈ రెసిడెంట్స్‌కి స్మార్ట్‌ గేట్స్‌

- March 22, 2016 , by Maagulf
విమానాశ్రయాల్లో యూఏఈ రెసిడెంట్స్‌కి స్మార్ట్‌ గేట్స్‌


యూఏఈ ఇ-పోర్ట్‌ సిస్టమ్‌లో 1.5 మిలియన్‌ ప్రజలు రిజిస్టర్‌ అయి ఉన్నారు.విమానాశ్రయాల్లో యూఏఈ సిటిజన్స్‌ మరియు రెసిడెన్స్‌ కోసం స్మార్ట్‌ గేట్స్‌ని ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక సౌకర్యంగా ఇ-పోర్ట్‌ సిస్టమ్‌ని ప్లాన్‌ చేశారు. అబుదాబీ, దుబాయ్‌ మరియు షార్జా విమానాశ్రయాల్లో తొలి దశలో భాగంగా స్మార్ట్‌ గేట్స్‌ ఏర్పాటు చేశామని, ఇ-పోర్ట్‌లో రిజిస్టర్‌ అయినవారికి కేవలం 7 సెకెన్లలోనే ఇ-గేట్స్‌ ద్వారా వెళ్ళేందుకు అవకాశం ఉందని ఇంటీరియర్‌ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయాల్లో అనసవర జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రయాణీకులు ఐరిస్‌ స్కానింగ్‌ మరియు రికగ్నిషన్‌ (బయోమెట్రిక్‌ ఐడెంటిఫికేషన్‌) తర్వాత ఇ-గేట్స్‌ ద్వారా వెళ్ళవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com