ఈ ఏడాది చివరికల్లా..అంతర్జాతీయ విమాన సర్వీసులు!
- November 25, 2021
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావొచ్చని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు.కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్ కు తరలించేందుకు,అత్యవసర సరుకుల రవాణా కోసం ప్రభుత్వం కొన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అయితే కేసులు తగ్గుముఖం పట్టడం,వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా సాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









