ఇండియా, పాకిస్తాన్తో సహా ఆరు దేశాల ప్రజలకు సౌదీలోకి డైరెక్ట్ ఎంట్రీ
- November 26, 2021సౌదీ అరేబియా: ఇండోనేషియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, బ్రెజిల్, వియత్నాం దేశాల నుండి మూడవ దేశంలో 14 రోజుల నిర్బంధాన్ని గడపకుండా నేరుగా ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా గురువారం ప్రకటించింది. కొత్త ఆదేశాలు డిసెంబర్ 1, 2021 నుండి అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ఇమ్యునైజేషన్ స్థితితో సంబంధం లేకుండా ఐదు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. COVID-19 వ్యాప్తిని ఎదుర్కొనే ప్రయత్నంలో, కొన్ని దేశాల నుండి సౌదీ లోకి నేరుగా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎపిడెమియోలాజికల్ పరిస్థితులను ఆరోగ్య అధికారులచే నిరంతర మూల్యాంకనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ తెలిపింది.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!