ఇండియా, పాకిస్తాన్తో సహా ఆరు దేశాల ప్రజలకు సౌదీలోకి డైరెక్ట్ ఎంట్రీ
- November 26, 2021
సౌదీ అరేబియా: ఇండోనేషియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, బ్రెజిల్, వియత్నాం దేశాల నుండి మూడవ దేశంలో 14 రోజుల నిర్బంధాన్ని గడపకుండా నేరుగా ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా గురువారం ప్రకటించింది. కొత్త ఆదేశాలు డిసెంబర్ 1, 2021 నుండి అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ఇమ్యునైజేషన్ స్థితితో సంబంధం లేకుండా ఐదు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. COVID-19 వ్యాప్తిని ఎదుర్కొనే ప్రయత్నంలో, కొన్ని దేశాల నుండి సౌదీ లోకి నేరుగా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎపిడెమియోలాజికల్ పరిస్థితులను ఆరోగ్య అధికారులచే నిరంతర మూల్యాంకనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ తెలిపింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!