ఇండియా, పాకిస్తాన్తో సహా ఆరు దేశాల ప్రజలకు సౌదీలోకి డైరెక్ట్ ఎంట్రీ
- November 26, 2021సౌదీ అరేబియా: ఇండోనేషియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, బ్రెజిల్, వియత్నాం దేశాల నుండి మూడవ దేశంలో 14 రోజుల నిర్బంధాన్ని గడపకుండా నేరుగా ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా గురువారం ప్రకటించింది. కొత్త ఆదేశాలు డిసెంబర్ 1, 2021 నుండి అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ఇమ్యునైజేషన్ స్థితితో సంబంధం లేకుండా ఐదు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. COVID-19 వ్యాప్తిని ఎదుర్కొనే ప్రయత్నంలో, కొన్ని దేశాల నుండి సౌదీ లోకి నేరుగా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎపిడెమియోలాజికల్ పరిస్థితులను ఆరోగ్య అధికారులచే నిరంతర మూల్యాంకనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ తెలిపింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!