ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం..

- December 07, 2021 , by Maagulf
ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం..

న్యూఢిల్లీ: COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "ట్రావెల్ గైడ్ లైన్స్ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎతిహాద్ మేనేజర్ పై విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 188, ఇతర వర్తించే చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం." అని నోటీసుల్లో పేర్కొంది. ఎతిహాద్ కు చెందిన రెండు విమానాలు గైడ్ లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నోడల్ ఇంచార్జ్ వసంత్ విహార్ తెలిపారు. ఈ రెండు ఫ్లైట్ లకు నోటీసులు జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com