ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సు జారీ కోసం కొత్త విధివిధానాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
- December 07, 2021
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారు, దేశీయంగా పెరుగుతున్న వాహనాల వినియోగం కారణంగా ట్రాఫిక్ హెవీగా అవుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే విషయంలో కాస్త కఠినంగా ఉండాలని భావిస్తోంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని తగ్గించే విధంగా కొత్త నిబంధనలు తేనుంది. ఇందుకు సంబంధించిన పలు అధ్యయనాలను పరిశీలిస్తోంది. సోమవారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ట్రాఫిక్ విభాగం అధికారులతో సమావేశమై పలు ప్రతిపాదనలపై చర్చించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించే ఎలాంటి పద్దతులను అవలంభించాలో కూడా స్టడీ చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. అనంతరం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మాట్లాడుతూ... కువైట్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రాఫిక్ వ్యవస్థల్లో ఒక్కటిగా తయారుచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు