ప్రైవేటు ఇళ్ళ అద్దెలపై నియంత్రణకై ఎంపీ ప్రతిపాదన
- December 08, 2021
కువైట్ సిటీ: ఎంపీ మర్జౌక్ అల్ ఖలీఫా, ఓ ప్రతిపాదనని ప్రముఖ ప్రాంతాల్లోని ప్రైవేటు ఇళ్ళ అద్దెలకు సంబంధించి పెట్టడం జరిగింది. అనూహ్యంగా పెరుగుతున్న అద్దెలపై నియంత్రణ ఈ ప్రతిపాదన తాలూకు ఉద్దేశ్యం.క్యాపిటల్ మరియు హవాలీ గవర్నరేట్లలో చదరపు మీటరుకి 2.5 కువైటీ దినార్లకు మించకుండా అద్దె వుండాలన్నది ఎంపీ ప్రతిపాదన. అలాగే, ఫర్వానియా, జహ్రా, అహ్మది మరియు ముబారక్ అల్ కబీర్ ప్రాంతాల్లో చదరపు మీటరుకి 2 కువైటీ దినార్లకు మించకూడదని ఆయన తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. మోడల్ ప్రాంతాల్లోని ప్రైవేటు ఇళ్ళకే ఈ ప్రతిపాదన రూపొందించారు. ప్రధానంగా ఈ ఇళ్ళలో కువైటీలే నివసిస్తారు. వలసదారులు ఇన్వెస్టిమెంట్ భవనాల్లో నివసిస్తుంటారు. ఆ భవనాలకు ఈ ప్రతిపాదన వర్తించదు. నేషనల్ అసెంబ్లీ ఆమోదం పొంది, ప్రభుత్వం నుంచి ఆమోదం పొందితే తప్ప ఇది చట్టంగా మారదు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







