ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు..

- March 24, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... తెలంగాణలో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, నంద్యాల నగరాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, తిరుపతిలో 41, విజయవాడ, జంగమేశ్వరంలో 40, నెల్లూరులో 39, ఒంగోలు, తుని, ఆరోగ్యవరంలో 38, కావలిలో 37, బాపట్ల, కాకినాడ, మచిలీపట్నం, విశాఖలో 36, నరసాపురంలో 35, కళింగపట్నంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com