.'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మోహన్బాబు ఇడ్లీలు అమ్మారు..
- March 24, 2016
సీనియర్ తెలుగు నటుడు మంచు మోహన్బాబు ఇడ్లీలు అమ్మారు. తెలుగులో 500 పైగా చిత్రాల్లో నటించిన మోహన్బాబు ఇడ్లీలు అమ్మడం ఏంటి అనుకుంటున్నారా? ఇదేదో సినిమా షూటింగ్ కోసమని పొరబడకండి.'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మోహన్బాబు ఈ పని చేశారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డుపై మోహన్బాబు ఇడ్లీలు అమ్మారు. ఈ విషయాన్ని శ్రీ విద్యానికేతన్ కళాశాల తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మోహన్బాబు ఇడ్లీలు అమ్ముతుండగా తీసిన ఫొటోలను పోస్టు చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంచు లక్ష్మి హోస్ట్గా వ్యవహరిస్తున్న 'మేము సైతం' సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే నటీనటులు రకుల్ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మగా, రానా కూలీ అవతారం ఎత్తారు. అక్కినేని అఖిల్ ఆటో నడపగా, శ్రియ సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా పనిచేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









