టీటీడీలో ఉదయాస్తమాన సేవ
- December 18, 2021
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది.ఈ టికెట్పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది.అయితే ఈ టికెట్ల ద్వార రూ.600 కోట్ల ఆదాయం సమాకూరనుండగా.. ఈ ఆదాయం మొత్తంతో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనుంది.ఈ క్రమంలో టీటీడీ ఈనెల 23న ఉదయాస్తమాన సేవా ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఉదయాస్తమాన టికెట్తో స్వామివారికి ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ నుంచి తోమాల సేవ, కొలువు, అష్ట దళ పాద పద్మారాధన, అభిషేకం, వస్త్రాలంకార సేవ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావడ, సహాస్ర దీపాలకరణ సేవతో పాటు ఏకాంత సేవలో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల పై చర్చించిన ఒమన్, జర్మనీ..!!









