ఆధునిక బహ్రెయిన్ స్థాపనకు గుర్తుగా అతిపెద్ద స్మారక చిహ్నం

- December 19, 2021 , by Maagulf
ఆధునిక బహ్రెయిన్ స్థాపనకు గుర్తుగా అతిపెద్ద స్మారక చిహ్నం

మనామా: ఆధునిక బహ్రెయిన్ దేశం అవిర్భావానికి గుర్తుగా దేశంలోనే అతిపెద్ద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. క్యాపిటల్ గవర్నరేట్‌లోని కింగ్ ఫైసల్ హైవే, బహ్రెయిన్ బే మధ్య కూడలి వద్ద బహ్రెయిన్ కోట్స్ ఆఫ్ ఆర్మ్స్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. బహ్రెయిన్ జాతీయ దినోత్సవాల సంబరాల్లో భాగంగా క్యాపిటల్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ సాద్ అల్ సాహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ స్మారక విగ్రహం దాదాపు మూడు అంతస్తుల భవనమంతా పెద్దదిగా ఉండటం విశేషం. 1783లో ఆధునిక బహ్రెయిన్ ను అహ్మద్ అల్ ఫతేహ్ స్టార్ట్ చేశారు. దానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com